ప్రముఖ టీవీ నటుడు, యాంకర్ ఖయూమ్ అలియాస్ లోబోకు జనగామ కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. లోబో 2018లో వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురుకి గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా విచారించిన కోర్టు లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa