టాలీవుడ్ యువ నటుడు తేజా సజ్జా 'మిరాయి' అనే పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచానాలు ఉన్నాయి. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ నేషన్ వైడ్ గా 15 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ ప్రాకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. రితికా నాయక్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, జయరామ్ మరియు శ్రియా సరన్ కూడా కీలక పాత్రలలో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ పాన్ ఇండియన్ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తుంది. గౌరీ హర ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa