పిడుగుపాటుకు నాలుగు గొర్రెలు మృతి
 

by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:36 PM

పిడుగుపడి గొర్రెలు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా, రేగిడి మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంకిలి గ్రామానికి చెందిన ఇప్పిలి రాంబాబు, ఆయన సోదరుడు వెంకటరమణ గొర్రెలు పెంచుతూ జీవ నం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సంకిలి-దేవుదళ సరిహద్దుపొలాల్లో బుధవారం సా యంత్రం గొర్రెల మందను మేపిస్తున్నారు. ఇంతలో ఉరుములు, మెరుపులతో వర్షం వచ్చి, భారీశబ్దంతో పిడుగుపడింది. ఈ ప్రమాదంలో గొర్రెలమందకు సమీపంలో వేరేచోట మేస్తున్న నాలుగు గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. ఘటనాస్థలానికి కొద్దిదూరంలో ఉన్న గొర్రిల కాపరి రాంబాబు స్వల్ప అస్వస్థతకు లోనయ్యాడు. ఈయ నకు ఎటువంటి ప్రాణహాని లేకపోవటం కుటుంబీకులు ఊపిరి పీల్చుకొన్నారు. ఈ ఘటనలో రూ. 50వేలు విలువచేసే గొర్రెలు మృతి చెందడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరైంది. పిడుగుపాటు సమాచారాన్ని వీఆర్వో గోపాల్‌నాయుడు స్థానిక రెవెన్యూ కార్యాలయానికి తెలియజేశారు.

Latest News
Study warns patients not to rely on AI chatbots for drug information Fri, Oct 11, 2024, 10:32 AM
Gujarat: Central GST officer caught accepting Rs 1.25 lakh bribe Fri, Oct 11, 2024, 10:29 AM
Rajnath Singh to attend Army Commanders' Conference in Gangtok Fri, Oct 11, 2024, 10:23 AM
Delhi cop arrested for accepting bribe Fri, Oct 11, 2024, 10:16 AM
Sensex, Nifty open slightly lower, Bharti Airtel and Bajaj Finance top losers Fri, Oct 11, 2024, 10:06 AM