![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 30, 2024, 07:56 PM
యద్దనపూడి మండలంలోని అన్ని గ్రామాలకు పింఛన్ల సొమ్ము విడుదలైందని, జులై ఒకటిన ఇంటింటికీ వెళ్లి అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో పి. శివ సుబ్రహ్మణ్యం ఆదివారం చెప్పారు. పంచాయతీ కార్యదర్శులతో ఆయన గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించారు. మండలంలోని 4, 967 మంది పింఛనుదారులకు రూ. 3, 20, 72500 నగదు విడుదలైందని చెప్పారు. పించనుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు బట్వాడా చేయాలని ఆయన ఆదేశించారు.
Latest News