by Suryaa Desk | Mon, Jul 01, 2024, 03:01 PM
నావి కీలక శాఖలు. గెలిచాక ఎందుకు రాలేదంటే నాకు ఊరేగింపులు ఇష్టం లేదు. నేరుగా పనిలోకి వెళ్ళలనుకున్నా. కృతజ్ఞత పెన్షన్లు ఇవ్వడం ద్వారా చాటాలనుకున్నా. నా శాఖలపై అధ్యయనం మొదలుపెట్టాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయన మాట్లాడుతూ..... దివ్యాంగులు గతంలో చాలా నష్టపోయారు. పీఆర్ శాఖలో అడ్డగోలుగా వైసిపి నిధులు మల్లించింది. నా శాఖలో నా వైపు అవినీతి ఉండదు. గోదావరి జిల్లాల్లో అనేక చోట్ల 80 శాతం చేపల చెరువులు.. కానీ తాగడానికి నీళ్లు లేవు. జల్ జీవన్ మిషన్కు కేంద్రం నిధులు ఇస్తుంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. రుషికొండలో విలాస భవనం అవసరమా? నా కొత్త క్యాంప్ ఆఫీస్కు నా ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటా అని చెప్పా. నా శాఖలో ఆర్థిక అక్రమాలు చాలా చేశారు. మేము అద్భుతాలు చేస్తాం అని చెప్పము. కానీ జవాబుదారీతనం గా ఉంటాం అని పవన్ స్పష్టం చేశారు.
Latest News