by Suryaa Desk | Mon, Jul 01, 2024, 05:36 PM
ఒకటికి ఏడు రెట్లు డబ్బులు వస్తాయనే ఆశతో మైక్వీన్ ఎర్నింగ్ యాప్లో పెట్టుబడి పెట్టిన వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో ఈ ఊబిలో పలువు రు ఇరుక్కున్నారు. ప్రస్తుతం యాప్ నిలిచి పోవడంతో వారంతా ఏం చేయాలో పాలుపోక లింక్ పంపిన వారిపై ఒత్తిడి చేస్తున్నారు. కొందరు మాత్రం పోలీసు అధికారులను ఆశ్ర యించి తమకు జరిగిన అన్యాయాన్ని వివరి స్తున్నారు. మరికొందరు మాత్రం డబ్బులు పోగొట్టుకున్నారని సమాజం చిన్నచూపు చూస్తుందని మిన్నకుంటున్నారు. పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఈ యాప్ మూలాలపై దృష్టిసారించినట్లు తెలు స్తోంది. పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందు తున్నా అధికారికంగా మాత్రం ఎక్కడా ఒక్క కేసు కూడా డివిజన్ పరిధిలో నమోదు చేయ లేదు. డివిజన్ పరిధిలో ఎక్కువ మందికి లింకు పంపించిన కీలకమైన వ్యక్తులపై దృష్టి సారించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క మార్కాపురానికే పరిమితం కాకుండా జిల్లావ్యాప్తంగా అన్నిచోట్ల ఈ యాప్లో పెట్టుబడులు పెట్టడంతో పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి.
Latest News