by Suryaa Desk | Mon, Jul 01, 2024, 05:47 PM
జి.సిగడాం పరిధిలోని గెడ్డకంచరాం గ్రామానికి చెందిన వివాహిత కుంచాల పోలమ్మ (26) ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం మండలం సింగివలస గ్రామానికి చెందిన సంతోష్ కుమార్తో పోలమ్మకి వివాహం జరిగింది. వీరిద్దరు కలిసి పోలమ్మ కన్నవారి గ్రామ మైన గెడ్డకంచరాం వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామ సమీపంలో గల ఊర చెరువుకు వెళ్లింది. దీంతో పోలమ్మ ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందింది. చేపల వేటకు అటుగా కొందరు మత్స్యకారులకు చెరువులో తేలియాడిన పోలమ్మ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలమ్మకు ఐదేళ్ల కుమార్తె శ్రవంతి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. పోలమ్మ తల్లి ఉప్పాడ పైడమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
Latest News