by Suryaa Desk | Tue, Jul 02, 2024, 05:51 PM
పోలవరం కాలువ నుంచి పట్టిసీమ నీటిని పొలాలకు తరలించేందుకు వీలుగా తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన మోటార్లు, సామగ్రి అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వంశీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండలాల్లోని రైతులకు ఉపయోగపడే విధంగా 500 మోటార్లు, సామాగ్రి కేవలం రైతులు మాత్రమే ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాజకీయాల కతీతంగా సేవలందించేందుకు రైతు ప్రయోజనాలే ముఖ్యంగా భావించి స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమంగా భావించి మోటార్లను సద్వినియోగం చేసుకోవాలని వంశీ విజ్ఞప్తి చేశారు.
Latest News