గురువారం ‘ఛావా’ సినిమా ప్రదర్శన ఉంటుందని, ఎంపీలందరూ తప్పకుండా హాజరుకావాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది
 

by Suryaa Desk | Wed, Mar 26, 2025, 01:57 PM

మరాఠా పోరాట యోధుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ‘ఛావా’ చిత్రాన్ని రూపొందించిన విషయం విదితమే. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఈ చిత్రం హిందీతో పాటు పలు భాషల్లో విడుదలై దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. సుమారు 700 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను పార్లమెంటులో ప్రదర్శించనున్నట్లు సమాచారం.గురువారం ‘ఛావా’ సినిమా ప్రదర్శన ఉంటుందని, ఎంపీలందరూ తప్పకుండా హాజరుకావాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా కారణంగానే ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని ఇటీవల ఆందోళనలు జరిగాయని, నాగ్ పూర్ లో హింస చెలరేగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైనటువంటి సినిమాను పార్లమెంటులో ప్రదర్శించడమేంటని ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఛావా’ సినిమా ప్రదర్శనను ప్రతిపక్ష ఎంపీలు బాయ్ కాట్ చేయనున్నట్లు సమాచారం

Latest News
2025 a year of evidence-based growth, global leadership for Ayush sector Fri, Dec 26, 2025, 12:59 PM
VHT: Kohli makes 77 against Gujarat; Rohit suffers golden duck vs Uttarakhand Fri, Dec 26, 2025, 12:55 PM
Revised rail fares to balance affordability, ensure sustainability come into effect Fri, Dec 26, 2025, 12:53 PM
Housing sales value in Indian cities jump 6 pc in 2025: Report Fri, Dec 26, 2025, 12:45 PM
SP's Afzal Ansari criticises UP minister over Sengar bail remarks Fri, Dec 26, 2025, 12:39 PM