వివాహేతర సంభంధం నేపథ్యంలో వ్యక్తిని హతమార్చిన భర్త
 

by Suryaa Desk | Wed, Mar 26, 2025, 01:57 PM

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో యోగా టీచర్‌ను ఓ వ్యక్తి ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టాడు. హర్యానాలోని చక్రిదాద్రిలో జరిగిందీ ఘటన. బాధితుడు జగదీప్ రోహ్‌తక్‌లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో యోగా టీచర్. ఆయనను కిడ్నాప్ చేసిన నిందితుడు ఏడుగుల గొయ్యి తీసి అందులో ఆయనను సజీవంగా పాతిపెట్టాడు. మూడు నెలల తర్వాత ఈ నెల 24న జగదీప్‌ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. పోలీసుల కథనం ప్రకారం.. డిసెంబర్ 24న జగదీప్‌ ఇంటికి వస్తుండగా నిందితుడు ఆయనను కిడ్నాప్ చేశాడు. కాళ్లు, చేతులు కట్టేశాడు. ఆపై అరవకుండా నోటికి ప్లాస్టర్ వేశాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అప్పటికే సిద్ధం చేసిన గోతిలో ఆయనను సజీవంగా పాతిపెట్టాడు. జగదీప్ కనిపించడం లేదంటూ కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఆయన కాల్ రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులు ధర్మపాల్, హర్‌దీప్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.విచారణ సందర్భంగా నిందితుడు భయంకరమైన నిజాలను వెల్లడించాడు. నిందితుడు ఉంటున్న భవనంలోనే జగదీప్ అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో నిందితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతిమంగా ఇది ఆయన హత్యకు దారితీసింది. 

Latest News
Former Thai PM Abhisit to fight upcoming general election Fri, Dec 26, 2025, 02:58 PM
Vaibhav Suryavanshi receives PM Rashtriya Bal Puraskar from President Droupadi Murmu, BCCI congratulates Fri, Dec 26, 2025, 02:52 PM
PM Modi calls for ending Macaulay's legacy of mental slavery on Veer Bal Diwas Fri, Dec 26, 2025, 02:49 PM
Ashes: Australia take 46-run lead as 20 wickets fall on Day 1 of MCG Test Fri, Dec 26, 2025, 02:25 PM
'Pressed by authorities to make changes to my X handle': Mirwaiz Umar Farooq on removing Hurriyat title Fri, Dec 26, 2025, 02:22 PM