![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 03:31 PM
ఏపీలోని రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాలు, ఇతర పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన చోట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ను విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రవీణ్ ఒంటిపై గాయాలు ఉండటంతో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రమాదం కాదని, ముమ్మాటికీ హత్యే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.