![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 06:49 PM
వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. నెల్లూరు జిల్లాలో యాక్టివ్గా ఉండే కాకాణి చుట్టూ ఉచ్చు బిగుస్తుండటం పార్టీలో కలకలం రేపుతోంది.
తాజాగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో కాకాణిపై ఇటీవల కేసు నమోదైంది. మరోవైపు సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ కుంభకోణం వెనుక కూడా కాకాణి హస్తం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో కాకాణి త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.