|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 04:08 PM
భారత వ్యతిరేక కుట్రల్లో పాకిస్తాన్, చైనాలతో పాటు ఇప్పుడు టర్కీ కూడా చేరింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ తన సైన్యం, ఆయుధాలు, డ్రోన్లను పాకిస్తాన్కు పంపి భారత్కు వ్యతిరేకంగా పోరాడింది. టర్కీలో ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశం భారత వ్యతిరేక వ్యూహాలను పెంచింది. టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ, పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి సమాచార సేకరణ, ఉగ్రవాద సమన్వయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. టర్కీ సహకారంతో ఉగ్రవాదులు భారత దేశంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు.
Latest News