|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:33 PM
జపాన్ను భూకంపాలు వణికిస్తూనే ఉన్నాయి. ఉత్తర జపాన్ తీరంలో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చి కనీసం 50 మంది గాయపడిన విషయం తెలిసిందే. తాజా భూకంపం నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ (JMA) సునామీ హెచ్చరికలు జారీ చేసింది.పసిఫిక్ తీర ప్రాంతాల్లో సుమారు మీటరు (మూడు అడుగుల) ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) కూడా భూకంప తీవ్రతను 6.7గా నిర్ధారించింది. హోన్షు ద్వీపంలోని ఇవాటే ప్రిఫెక్చర్లోని కుజీ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
Latest News