|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 03:10 PM
AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. రామచంద్రపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది. స్కూల్ సిబ్బంది హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దాంతో విద్యార్థిని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Latest News