అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం
 

by Suryaa Desk | Sat, Dec 13, 2025, 04:49 PM

రాజధాని అమరావతి రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ అంశంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక విషయాలు వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్‌కు ఇప్పటికీ భూములు ఇవ్వని రైతులతో మరోసారి చర్చలు జరుపుతామని, ఒకవేళ వారు అంగీకరించకపోతే వచ్చే నెల మొదటి వారంలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పెమ్మసాని, సుమారు 2,400 ఎకరాల భూమి ఇంకా ల్యాండ్ పూలింగ్‌ పరిధిలోకి రాలేదని తెలిపారు. వీధిపోటు వంటి సమస్యలున్న ప్లాట్లకు ఒకసారి మార్పులు చేసే అవకాశం కల్పిస్తామని రైతులకు సూచించారు. అయితే qప్రతి నెలా వాస్తు మార్పులు చేయడం సాధ్యం కాదు. సమస్యలు ఉన్నవారు ఒకేసారి వచ్చి పరిష్కరించుకోవాలి అని ఆయన తేల్చి చెప్పారు. జరీబు భూముల సమస్య పరిష్కారానికి నెల రోజుల సమయం పడుతుందని, సాయిల్ టెస్ట్ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.తాడికొండ బైపాస్ నిర్మాణం వల్ల నష్టపోయిన రైతులకు టీడీఆర్ బాండ్లు అందజేస్తామని పెమ్మసాని భరోసా ఇచ్చారు. హెల్త్ కార్డుల అంశంపై గ్రామసభలు నిర్వహించి నిర్ణయిస్తామని చెప్పారు. గ్రామాల్లో డీపీఆర్ ప్రకారం మౌలిక సదుపాయాల కల్పన, ఎల్‌పీఎస్ ప్రాంతాల్లో సరిహద్దు రాళ్ల ఏర్పాటు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న 18 కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి వివరించారు.

Latest News
My visit will boost bilateral linkages, says PM Modi after arriving in Jordan Mon, Dec 15, 2025, 06:01 PM
Odisha: Absconding accused arrested in multi-crore recruitment fraud case Mon, Dec 15, 2025, 06:00 PM
Political landscape changing in Telangana, says KTR after 2nd phase of Panchayat polls Mon, Dec 15, 2025, 05:57 PM
Karnataka: Dubai-based youth arrested for posting 'communal' content Mon, Dec 15, 2025, 05:55 PM
Karnataka HC asks authorities to consider student body's plea to meet CM over 2.84 lakh vacant posts Mon, Dec 15, 2025, 05:54 PM