ఎస్‌బీఐ అప్‌గ్రేడ్ చేసిన యోనో 2.0 యాప్ త్వరలోనే లాంచ్.. 2 ఏళ్లలో 20 కోట్ల లక్ష్యం
 

by Suryaa Desk | Sun, Dec 14, 2025, 10:44 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు మరో అదిరే శుభవార్త చెప్పింది. తమ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ యోనో యూజర్ల సంఖ్యను రెండింతలు చేసే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండేళ్లలో 20 కోట్ల మంది యోనో డిజిటల్ బ్యాంకింగ్ యాప్ ఉపయోగించడమే లక్ష్యంగా అప్‌గ్రెడెడ్ వెర్షన్ యోనో 2.0 ను లాంచ్ చేయబోతున్నమాని ఆ బ్యాంక్ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి ప్రకటించారు. తమ కస్టమర్లకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు, వేగంగా సేవలందించేందుకు కొత్త యాప్ లాంచ్ చేస్తున్నట్లు చెప్పారు.


'యోనో 2.0 అనేది ఒక ప్రధానమైన సాంకేతిక మెరుగుదల. దేశంలోని అతిపెద్ద బ్యాంకుకు బలమైన డిజిటల్ బ్యాక్‌బోన్‌గా సేవలందిస్తూనే మెరుగైన కస్టమర్ అనుభవాన్ని అందించే ఒక ప్రధాన సాంకేతిక అప్‌గ్రేడ్ యోనో 2.0. ప్లాట్ ఫామ్ పూర్తి స్థాయి సేవలు రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో క్రమంగా అందుబాటులోకి వస్తాయి. బ్యాంకు ప్రకారం YONO 2.0 అనేది డిజిటలైజేషన్‌లో కీలకమైన అంశం. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ కోసం ఒక సాధారణ కోడ్‌తో ఇది అన్ని ఛానెల్‌లలో సజావుగా ఏకీకరణకు వీలు కల్పిస్తుంది. SBI కొత్త ఉత్పత్తులు, ప్రక్రియలను త్వరగా ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది. బ్యాంక్ తన డిజిటల్ ఉనికిని, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ మెరుగుపరచడానికి YONO 2.0ని ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.' అని ఎస్‌బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి తెలిపారు.


YONO 2.0 కస్టమర్లకు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఖాతా తెరవడం సహా ఇతర లావాదేవీలు వంటి సేవల కోసం బ్రాంచ్ ఛానెల్‌లలో సజావుగా అనుభవాన్ని అందిస్తుందని ఎస్‌బీఐ ఛైర్మన్ తెలిపారు. ప్రస్తుతం యోనో డిజిటల్ యాప్ 10 కోట్ల మంది కస్టమర్లు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. 20 కోట్ల మంది కస్టమర్లను YONO మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. దాదాపు 20 కోట్ల మంది కస్టమర్ బేస్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాలలో గణనీయమైన స్థాయిలో పెట్టుబడి పెట్టాల్సి ఉందన్నారు. రాబోయే రెండేళ్లలో కనీసం 20 కోట్ల మంది కస్టమర్ బేస్ ఉండాలి భావిస్తున్నట్లు చెప్పారు.

Latest News
He's incredibly valued within this group: McDonald backs Khawaja despite axing from Adelaide Test Tue, Dec 16, 2025, 02:02 PM
Sri Lanka reopens most schools as 3rd term resumes after Cyclone Ditwah Tue, Dec 16, 2025, 01:56 PM
Nitish Kumar govt announces implementation of 'Saat Nishchay - 3' in Bihar Tue, Dec 16, 2025, 01:52 PM
India's paints industry set to touch $16.5 billion by 2030 Tue, Dec 16, 2025, 01:09 PM
Crown Prince Al Hussein Bin Abdullah II drives PM Modi to Jordan Museum Tue, Dec 16, 2025, 01:07 PM