|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:40 PM
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అయినా, ఫామ్ కోల్పోలేదని, త్వరలోనే మళ్లీ పరుగుల వరద పారిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే, నేను నెట్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాను. నా నియంత్రణలో ఉన్న ప్రతిదాన్నీ ప్రయత్నిస్తున్నా. పరుగులు రావలసిన సమయంలో అవే వస్తాయి. నేను పరుగుల కోసం చూస్తున్నాను తప్ప, ఫామ్లో లేనని చెప్పను" అని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ 12 పరుగులకే ఔటయ్యాడు.గత మ్యాచ్లో ఎదురైన ఓటమి నుంచి జట్టు ఎలా పుంజుకుందని అడగ్గా.. ప్రాథమిక అంశాలపై దృష్టి సారించడమే కీలకమని చెప్పాడు. క్రికెట్ ఎన్నో విషయాలు నేర్పుతుందని, సిరీస్లోకి ఎలా పునరాగమనం చేస్తామన్నదే ముఖ్యమని చెప్పాడు. తాము కటక్లో చేసినట్లే, మళ్లీ బేసిక్స్పై దృష్టి పెట్టాలనుకున్నామని, దాని ఫలితమే ఈ విజయమని పేర్కొన్నాడు. చండీగఢ్లో జరిగిన మ్యాచ్ నుంచి చాలా నేర్చుకున్నామని వివరించాడు.
Latest News