2023 సంవత్సరానికి గాను 'జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం'ను అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం
 

by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:54 PM

ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ, ఇంధన సామర్థ్యం రంగాల్లో మరోమారు జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. 2023 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక 'జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం'ను రాష్ట్రం సొంతం చేసుకుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిన్న జరిగిన జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఎల్. శివ శంకర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.స్టేట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీ (ఎస్‌డీఏ) కేటగిరీలోని గ్రూప్-II రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి బహుమతిని గెలుచుకుంది. ఇంధన పొదుపు, వాతావరణ పరిరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలుస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఈ పురస్కారం రాష్ట్రానికి మరో గర్వకారణమైన మైలురాయిగా నిలిచింది.

Latest News
President Murmu inaugurates photo gallery dedicated to 21 Param Vir Chakra awardees Tue, Dec 16, 2025, 02:55 PM
Ashok Gehlot welcomes court's decision in National Herald case Tue, Dec 16, 2025, 02:36 PM
India leads AI‑forward payroll market innovation globally: Report Tue, Dec 16, 2025, 02:29 PM
Goa fire tragedy: Luthra brothers brought back to Delhi after deportation from Thailand Tue, Dec 16, 2025, 02:21 PM
He's incredibly valued within this group: McDonald backs Khawaja despite axing from Adelaide Test Tue, Dec 16, 2025, 02:02 PM