|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:55 PM
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన కొన్ని గంటల భారత పర్యటన కోసం ఈరోజు ఉదయం 10:45 గంటలకు ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బస చేయనున్న చాణక్యపురిలోని 'ది లీలా ప్యాలెస్' హోటల్ వద్ద అసాధారణ భద్రతను ఏర్పాటు చేశారు. మెస్సీ, ఆయన బృందం కోసం హోటల్లో ఒక ఫ్లోర్ మొత్తాన్ని ప్రత్యేకంగా కేటాయించారు.మెస్సీ బస చేయనున్న ప్రెసిడెన్షియల్ సూట్ల రోజువారీ అద్దె రూ. 3.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆయన బసకు సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు పొక్కకుండా హోటల్ సిబ్బందికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో మెస్సీ పర్యటనల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి హోటల్ పరిసర ప్రాంతాలను హై-సెక్యూరిటీ జోన్గా మార్చారు.ఇక, ఈ పర్యటనలో భాగంగా ఎంపిక చేసిన కార్పొరేట్, వీఐపీ అతిథుల కోసం హోటల్లో ఒక 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫుట్బాల్ ఐకాన్ను కలిసే ఈ అవకాశం కోసం కొన్ని కార్పొరేట్ సంస్థలు ఏకంగా రూ. 1 కోటి వరకు వెచ్చించినట్లు సమాచారం.
Latest News