|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:22 PM
మహిళల వన్డే ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శనతో రాష్ట్రానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన క్రికెటర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలవడంపై సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ మంత్రి నారా లోకేశ్ తెలుగు క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్ అందించారు. దీనిపై నారా భువనేశ్వరి స్పందించారు. క్రీడల్లో రాణిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి, వారికి సరైన ప్రోత్సాహం అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఆమె ప్రశంసించారు.ఈ సందర్భంగా ఆమె, "రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచే క్రీడాకారులను గౌరవించడంలో ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ ముందుంటుంది. శ్రీచరణికి ప్రభుత్వం అందిస్తున్న ఈ గుర్తింపు, మద్దతు హర్షణీయం. ఇలాంటి ప్రోత్సాహకాలు భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తాయి" అని పేర్కొన్నారు.
Latest News