|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:14 PM
బంగ్లాదేశ్లో అరాచకం హద్దులు దాటుతోంది. రాజకీయ కక్షల వల్ల ఒక పసి ప్రాణం బలవగా, ఒక కుటుంబం మొత్తం ప్రాణాపాయ స్థితిలో ఉంది. లక్ష్మీపూర్ సదర్ ఉపజిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన సంచలనం సృష్టిస్తోంది.బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నేత, వ్యాపారవేత్త బేలాల్ హొస్సేన్ నివాసమే లక్ష్యంగా దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘాతుకం జరిగింది. దుండగులు పథకం ప్రకారం ఇంటికి ఉన్న రెండు తలుపులకు బయట నుంచి తాళం వేశారు. అనంతరం ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీనివల్ల లోపల ఉన్న వారు బయటకు రావడానికి వీలు లేకుండా పోయింది.ఈ అగ్నిప్రమాదంలో బేలాల్ హొస్సేన్ ఏడేళ్ల కుమార్తె అయేషా అక్తర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. బేలాల్తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు సల్మా అక్తర్ (16), సమియా అక్తర్ (14)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి శరీరాలు 50-60 శాతం వరకు కాలిపోయాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఢాకాలోని బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఇనిస్టిట్యూట్కు తరలించారు.
Latest News