|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:04 PM
టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో చేసిన మార్పులపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి, జట్టు యాజమాన్యానికి 10కి 10 మార్కులు ఇచ్చాడు. రింకూ సింగ్, ఇషాన్ కిషన్లను తిరిగి జట్టులోకి తీసుకోవడం, అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా నియమించడం సరైన నిర్ణయాలని కొనియాడాడు.హర్భజన్ మాట్లాడుతూ... "సెలక్షన్ కమిటీకి నేను 10కి 10 మార్కులు ఇస్తాను. శుభ్మన్ గిల్ను తప్పించడం కఠినమైన నిర్ణయమే అయినా, టీ20లలో అతడి కెరీర్ ముగిసిపోలేదు. జట్టు సమతూకానికే వారు ప్రాధాన్యత ఇచ్చారు. రింకూ సింగ్, ఇషాన్ కిషన్ జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇషాన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఓపెనర్గా వచ్చి వికెట్ కీపింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాడు అవసరం కాబట్టే ఈ మార్పులు చేశారు. ఇది చాలా మంచి నిర్ణయం" అని భజ్జీ విశ్లేషించాడు.
Latest News