17 ఏళ్ల తర్వాత స్వదేశానికి ఖలీదా జియా కుమారుడు, ,,,బంగ్లాాదేశ్ పార్లమెంట్‌కు 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు
 

by Suryaa Desk | Mon, Dec 22, 2025, 08:38 PM

ఇస్లామిక్ ర్యాడికల్స్ విధ్వంసాలతో బంగ్లాదేశ్‌ మరోసారి అట్టుడికిపోతోంది. వచ్చే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనుండగా కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకోనుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడి తారిఖ్ రహ్మాన్ డిసెంబరు 25న గురువారం స్వదేశానికి తిరిగి రానున్నారు. ఆయన రాక సందర్భంగా సభను నిర్వహణ కోసం బీఎన్పీ అనుమతి తీసుకుంంది. తారిఖ్ రహ్మాన్ రాకతో బంగ్లాశ్ రాజకీయాల్లో మలుపు తిరిగే అవకాశం ఉంది. త్వరలోనే జరగబోయే ఎన్నికల్లో బీఎన్పీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


తారిఖ్ రహ్మాన్ ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం విదేశాంగ విధానంపై స్పష్టమైన వైఖరిని ప్రకటించారు. ‘ఢిల్లీ కాదు, రావల్పిండి కాదు, అన్నింటికంటే ముందు బంగ్లాదేశ్’ అని ఆయన అన్నారు. ఏ దేశంతోనూ సన్నిహిత సంబంధాలు పెట్టుకోకుండా బంగ్లాదేశ్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇది తాత్కాలిక ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి పూర్తి భిన్నంగా ఉంది.


గతంలో షేక్ హసీనా ప్రభుత్వం భారత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. కానీ, తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శలు వస్తున్నాయి. నాటి షేక్ హసీనా ప్రభుత్వంపై బీఎన్పీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని హసీనా అణచివేశారని ఆరోపించిింది. అయితే, తాత్కాలిక ప్రభుత్వంతో కూడా BNPకి విభేదాలున్నాయి. ఎన్నికలు నిర్వహించాలనే ఒత్తిడితోనే తాత్కాలిక ప్రభుత్వం ఫిబ్రవరిలో ఎన్నికలు ప్రకటించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


జమాతే ఇస్లామీ, బీఎన్పీ గతంలో పొత్తు పెట్టుకున్నాయి. కానీ, తారిఖ్ రహ్మాన్ బంగ్లాదేశ్ హింసాత్మక రాజకీయ చరిత్రను బాగా అర్థం చేసుకున్నారు. షేక్ హసీనా పార్టీ బంగ్లాదేశ్ అవామీ లీగ్‌ను ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించడంతో ఆ దేశ రాజకీయాల్లో బీఎన్పీ కీలక పాత్ర పోషించనుంది. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్‌ను తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఎన్నికల్లో పొత్తులకు జమాతే నిరాకరించింది. దీంతో, బీఎన్పీకి, ఇతర శక్తులకు మధ్య పోటీ నెలకొంది. ఎన్నికలు ఆలస్యమైతే బీఎన్పీ నష్టం తప్పదు ఎందుకంటే వారి ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది.


ఎన్నికలు, ప్రజాభిప్రాయ సేకరణ ఒకే రోజు నిర్వహించడం ఘర్షణకు దారితీస్తుందని జమాతే హెచ్చరించింది. కానీ, తాత్కాలిక ప్రభుత్వం ఒకే రోజు రెండింటినీ ప్రకటించింది. ఇది ఎన్నికలను అడ్డుకోవడానికి జమాతే అవకాశం కల్పిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో, బీఎన్పీ గెలిచి, తారిఖ్ రహ్మాన్ ప్రధాని అయితే దేశాన్ని ఏకం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే కార్యక్రమాలను ఆయన ఇప్పటికే ప్రకటించారు.


ఖలీదా జియా బోగ్రా-7 నియోజకవర్గం నుంచి, తారిఖ్ రహ్మాన్ బోగ్రా-6 నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 1991 నుంచి 2008 వరకు ఖలీదా జియా బోగ్రా-6 నుంచి వరుసగా గెలిచారు. తారిఖ్ రహ్మాన్, తన పార్టీని ప్రజాస్వామ్యాని ఛాంపియన్‌గా అభివర్ణించారు. ‘ప్రజాస్వామ్యం మాత్రమే మనల్ని రక్షించగలదు. ఆ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగల శక్తి బీఎన్పీ సభ్యులందరిలో ఉంది’ అని ఆయన పిలుపునిచ్చింది. తారిఖ్ రహ్మాన్ 2008లో తన కుటుంబంతో కలిసి దేశం విడిచి వెళ్లారు. 18 నెలలు జైలులో ఉన్న తర్వాత, 2008 సెప్టెంబర్ 3న విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన యూకేలో ఆశ్రయం పొందారు.

Latest News
Sensex, Nifty post mild losses amid sustained FPI outflows Tue, Dec 30, 2025, 12:02 PM
Six killed as bus plunges into ravine in Uttarakhand's Almora Tue, Dec 30, 2025, 11:59 AM
Legends 90 League unveil season four in Dubai Tue, Dec 30, 2025, 11:55 AM
Man shot at by bike-borne men in Patna outskirts Tue, Dec 30, 2025, 11:46 AM
Trump moves to shut asylum 'loophole': US media Tue, Dec 30, 2025, 11:43 AM