|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 12:16 PM
ఎన్నికలకు ముందు చోడవరం షుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటామని హామీ ఇచ్చిన కూటమి నేతలు, ఇప్పుడు మాట తప్పారని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. గత ఏడాది క్రషింగ్ చేసిన లక్ష టన్నుల షుగర్ ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీకి వెంటనే 50 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 90 కోట్ల రూపాయలు తీసుకువచ్చామని గుర్తుచేశారు. రైతులు కష్టాల్లో ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజు, బండారు సత్యనారాయణ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పాలనలో రైతులకు ఒక్క రూపాయి కూడా బకాయిలు లేవన్నారు.
Latest News