|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 12:17 PM
సహకార రంగంలో మిగిలిన ఏకైక షుగర్ ఫ్యాక్టరీని కూడా కూటమి ప్రభుత్వం కాపాడలేకపోతోందని వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ మండిపడ్డారు. ఈ విషయంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల్లో ఎలాంటి చలనం లేదని విమర్శించారు. వైయస్ఆర్సీపీ పాలనలో ప్రతి సీజన్లో రైతులకు సమయానికి బకాయిలు చెల్లించేవారని గుర్తుచేశారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీని ఆదుకునేందుకు వైయస్ జగన్ గారు 90 కోట్ల రూపాయలు విడుదల చేసి సహకార రంగంలో మిగిలిన ఏకైక షుగర్ ఫ్యాక్టరీని కాపాడారని తెలిపారు. స్పీకర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఒక షుగర్ ఫ్యాక్టరీని కూడా ఆదుకోలేకపోతోందని మండిపడ్డారు. సంక్రాంతి లోపు బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Latest News