|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:34 PM
రాజమహేంద్రవరంలోని రోడ్ కం రైలు వంతెనపై శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. కుమార్తె, మనవరాలితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. బ్రిడ్జిపై నడుస్తూ ఉన్నట్టుండి తల్లి నదిలో దూకగా.. ఆ వెంటనే దూకబోతున్న కూతురు, మనవరాలిని స్థానికులు అడ్డుకుని కాపాడారు. నదిలో దూకిన తల్లి ఈగల ధనలక్ష్మి గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన ఈగల ధనలక్ష్మి తన కుమార్తె విజయకుమారిని మండపేటకు చెందిన బూసాల వినయ్కుమార్కు ఇచ్చి 2020లో వివాహం చేశారు. వారికి కుమారుడు మోక్షిత్ (4), కుమార్తె లక్ష్మీప్రసన్న(1.5) ఉన్నారు. ఇటీవల ఈ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వినయ్ తనను వేధిస్తున్నాడని విజయ తన తల్లి ధనలక్ష్మితో చెప్పుకుని బాధపడింది. దీంతో కూతురి కాపురాన్ని చక్కదిద్దాలనే ఉద్దేశంతో ధనలక్ష్మి శుక్రవారం ఉదయం మండపేట వెళ్లారు.కూతురు, అల్లుడికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ధనలక్ష్మి కుమార్తె విజయ, మనవరాలు లక్ష్మీప్రసన్నలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజమహేంద్రవరం చేరుకుని ఆటోలో వంతెనపైకి వెళ్లారు. కొంతదూరం నడుస్తూ వెళ్లిన ధనలక్ష్మి సడెన్ గా గోదావరిలో దూకారు. ఆ వెంటనే విజయకుమారి, లక్ష్మీ ప్రసన్న కూడా దూకబోతుండగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.
Latest News