మీరు తాగే నీరు నాణ్యతను ఇంట్లోనే ఇలా పరీక్షించుకోండి
 

by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:49 PM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో జరిగిన ఘోర దుర్ఘటనలో కలుషిత నీరు తాగడం వల్ల కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదు నెలల చిన్నారి కూడా ఉండటం అత్యంత బాధాకరం. వందల మంది అస్వస్థతకు గురికాగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదంతో ఎన్నో దేవుళ్లకు మొక్కుకుంటే పెళ్లైన పదేళ్ల తర్వాత లేక లేక కలిగిన బిడ్డను ఓ తల్లి పోగొట్టుకుంది. . కాలనీకి చాలా కాలంగా మురికి నీరు సరఫరా అవుతోందని, దానిని తాగిన నివాసితులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, ఇంట్లోనే నీటి నాణ్యతను పరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటర్ టెస్టింగ్ కిట్‌లను ఉపయోగించడం వల్ల నీటిలో కాలుష్యం ఉందో లేదో తెలుసుకోవచ్చు. దీనివల్ల తీవ్రమైన అనారోగ్యాలను కూడా నివారించవచ్చు. అయితే, సరైన ఫలితాల కోసం కిట్‌లను సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం.


ఏ వాటర్ టెస్టింగ్ కిట్ ఉత్తమం?


కోలిఫాం, కోలి టెస్ట్ కిట్: ఇది చాలా నమ్మకమైంది. దీని ఫలితాలు 90 శాతం వరకు కచ్చితంగా ఉంటాయి. ఇది నీటిలో మలమూత్రాల నుంచి వచ్చే బ్యాక్టీరియాను గుర్తిస్తుంది. ఫలితాలు రావడానికి 18-24 గంటలు పడుతుంది.


క్లోరిన్ టెస్టింగ్ కిట్: మున్సిపల్ నీటి సరఫరాలో క్రిములను చంపడానికి క్లోరిన్‌ను కలుపుతారు. ఈ కిట్ క్లోరిన్ స్థాయిలను కొలుస్తుంది. తగినంత క్లోరిన్ ఉంటే, నీరు తాగడానికి సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.


టర్బిడిటీ టెస్ట్ ట్యూబ్: వర్షం లేదా పైపు లీకేజీల వల్ల రంగు మారిన నీటిని పరీక్షించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నీరు మురికిగా, కలుషితంగా ఉందో లేదో ఇది త్వరగా తెలియజేస్తుంది.


వాటర్ టెస్టింగ్ కిట్‌లను ఎలా ఉపయోగించాలి?


ముందుగా, శుభ్రమైన కంటైనర్‌లో నీటిని సేకరించాలి.


కోలిఫాం కిట్ కోసం: రియేజెంట్‌ను జోడించి, పక్కన పెట్టండి. 18-24 గంటల తర్వాత రంగు మార్పును గమనించండి.


క్లోరిన్ కిట్ కోసం: టెస్ట్ స్ట్రిప్ లేదా ద్రావణంలో కొన్ని చుక్కల నీటిని కలపండి. రంగు మారకపోతే, నీరు సురక్షితం కాకపోవచ్చు.


టర్బిడిటీ ట్యూబ్ కోసం: నీళ్లు వేసిన తర్వాత ట్యూబ్‌ లోపలి నుంచి చూడండి. అడుగున ఉన్న గుర్తు అస్పష్టంగా కనిపిస్తే, నీరు కలుషితమైనట్లు అర్థం.


టీడీఎస్ మీటర్ అంటే ఏమిటి?


టీడీఎస్ మీటర్ నీటిలోని ఖనిజాలు, లవణాలను కొలుస్తుంది. TDS స్థాయిలు 300 mg/L కంటే తక్కువ ఉంటే, నీరు స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. 300-600 mg/L మధ్య ఉంటే, అది తాగడానికి ఇంకా అనుకూలమైనదే. 600 mg/L కంటే ఎక్కువ ఉంటే, అది తాగడానికి హానికరం.


ఇండోర్ విషాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ఇలాంటి విపత్తులను ముందుగా నివారించడానికి ప్రజలు తమ తాగునీటిని ముందుగానే పరీక్షించుకోవాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు.


Latest News
Assembly polls: Cong steps up alliance talks; Rahul, Priyanka may visit TN soon Thu, Jan 08, 2026, 12:28 PM
Tourists enjoy Nainital's charm, but snowfall remains a no-show, leaving local businesses in worry Thu, Jan 08, 2026, 12:25 PM
Delhi Police identify 548 illegally staying foreign nationals; sent for deportation in 2025 Thu, Jan 08, 2026, 12:19 PM
Study on women's safety in public spaces and transport in Chennai soon Thu, Jan 08, 2026, 12:11 PM
Higher intake of processed foods with preservatives may raise risk of cancer Thu, Jan 08, 2026, 12:10 PM