|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 10:35 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నేడు (గురువారం) సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కృష్ణా నది తీరంలో మెరినా వాటర్ఫ్రంట్ అభివృద్ధికి భూ కేటాయింపులు, రాజధానిలో 112 ఫ్లాట్ల మార్పులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే ఎస్ఐపీబీలో ఆమోదించిన 14 సంస్థల రూ.19,391 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు, పలు భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది
Latest News