|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 10:38 AM
ముంబైలోని గోరేగావ్ వెస్ట్, భగత్ సింగ్ నగర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు పురుషులు, ఒక మహిళ మరణించారు. ప్రమాద సమయంలో నిద్రలో ఉన్న బాధితులు తెరుకునే లోపే ఈ ప్రమాదం జరిగింది.
Latest News