|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 11:00 PM
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టీ20లో మొదటి పది ఓవర్లలో పరుగుల వరద పారించిన కివీస్.. ఆఖరి పది ఓవర్లలో ఢీలా పడింది. కివీస్ ఆరంభం చూసి 250 పరుగులు చేస్తుందని అనుకున్నారు. మొదటి పది ఓవర్లలో 111 పరుగులు చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి రన్స్ చేసింది. ఛాప్మన్ విఫలవ్వడంతో 200 మార్క్ కూడా అందుకోలేదని అందరూ అనుకున్నారు.. కానీ శాన్ట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో రాణించి టీమిండియాకు 209 పరుగుల టార్గెట్ ఇచ్చాడు.
రాయ్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఓపెనర్లు టిమ్ సైఫర్టీ, డెవాన్ కాన్వే శుభారంభం ఇచ్చారు. కాన్వే 9 బంతుల్లో 19, టిమ్ సైఫర్టీ 13 బంతుల్లో 24 పరుగులు చేశారు. ఈ ఇద్దరూ 3 ఓవర్లలోనే 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరూ వెంటవెంటనే అవుటయ్యారు.
నాగ్పూర్ టీ20లో అదరగొట్టిన గ్లెన్ ఫిలిప్స్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్తో 19 పరుగులు చేసి షాట్కి ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. ఐసీసీ వన్డే నెంబర్ వన్ బ్యాటర్ డారిల్ మిచెల్ 11 బంతుల్లో మూడు ఫోర్లతో 18 పరుగులు చేసి అవుటయ్యాడు. వికెట్లు పడుతున్నా తన క్లాస్ షాట్స్తో పరుగులు రాబట్టిన రచిన్ రవీంద్రను కుల్దీప్ యాదవ్ అద్భుత బంతితో పెవిలియన్కు పంపాడు. 26 బంతులు ఆడిన రచిన్ రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 44 పరుగులు చేశాడు.
మార్క్ ఛాప్మన్ 13 బంతుల్లో కేవలం పది పరుగులే చేసి నిరాశ పరిచాడు. మిడిలార్డర్ మొత్తం విఫలమయినప్పటికీ కెప్టెన్ మిచెల్ శాన్ట్నర్ మాత్రం నిదానంగా ఆడి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మిచెల్ శాన్ట్నర్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్తో 47, జాక్ ఫోక్స్ 8 బంతుల్లో 15 పరుగులతో నాటౌట్గా నిలిచారు. దాంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దుబే తలో వికెట్ పడగొట్టారు.
Latest News