|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 10:20 AM
జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాల్ లేక్ తీరంలో ఉన్న ఓ హోటల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, వాటర్ అంబులెన్స్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల భారీగా ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest News