ఐసీసీ వైఖరిపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షాహిద్ అఫ్రిది
 

by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:52 PM

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి కొద్ది వారాల ముందు, ఐసీసీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ, అనవసరంగా భారత్‌ను ఈ వివాదంలోకి లాగాడు. బంగ్లాదేశ్ విషయంలో కఠినంగా వ్యవహరించిన ఐసీసీ, భారత్ విషయంలో మాత్రం మెతక వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించాడు.భారత్‌లో షెడ్యూల్ అయిన మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భద్రతా కారణాలతో నిరాకరించింది. దీంతో ఐసీసీ ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసుకుంది. ఈ పరిణామంపైనే అఫ్రిది సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. "ఒక మాజీ అంతర్జాతీయ క్రికెటర్‌గా, ఐసీసీ స్థిరత్వం లేకపోవడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. 2025లో పాకిస్థాన్‌ పర్యటనకు రానప్పుడు భారత్‌ భద్రతా ఆందోళనలను అంగీకరించిన ఐసీసీ, ఇప్పుడు బంగ్లాదేశ్‌కు అదే వెసులుబాటును క‌ల్పించ‌డానికి ఇష్టపడటం లేదు" అని పేర్కొన్నాడు. క్రీడకు పునాది సమానత్వం అని, కానీ ఐసీసీ మాత్రం వంతెనలు నిర్మించడానికి బదులుగా వాటిని కూల్చివేస్తోందని అఫ్రిది ఆరోపించాడు.

Latest News
Sensex, Nifty open in red; IT continues to bleed Fri, Feb 20, 2026, 11:14 AM
Trump weighs limited Iran strike: WSJ Fri, Feb 20, 2026, 11:07 AM
Mensik upsets Sinner in Doha, sets SF with Fils Fri, Feb 20, 2026, 11:05 AM
South Korea attends inaugural meeting of Trump's peace board for Gaza Fri, Feb 20, 2026, 11:01 AM
Delhi Police bust robbery syndicate, arrest four Fri, Feb 20, 2026, 10:51 AM