|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 01:16 PM
చేతిలో అధికారం ఉందన్న అహంకారంతో కూటమి నాయకులు ఏడాదిన్నరగా చేస్తున్న అరాచకాలకు హద్దులు లేకుండా పోయాయని వైయస్ఆర్సీపీ నాయకుడు చంద్రగిరి యేసురత్నం విమర్శించారు. దళితులపై దాడులతో మోయలేనంత పాపాన్ని మూటగట్టుకున్నారని అన్నారు. మందా సాల్మన్ హత్యకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.కూటమి నాయకుల వేధింపులకు ఏ వర్గమూ మినహాయింపు కాదని, అధికార పార్టీకి వంతపాడుతున్న పోలీసులు శాశ్వతంగా పదవుల్లో ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 300 కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంటూ, వెనుకబడిన వర్గాలన్నీ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.
Latest News