|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 10:52 PM
గువాహటిలో జరిగిన న్యూజిలాండ్తో మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్తో సంచలనం సృష్టించాడు. కేవలం 14 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అభిషేక్ బ్యాటింగ్ వేగం చూసి న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన బ్యాట్ను సరదాగా చెక్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
154 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సంజూ శాంసన్ తొలి బంతికే డకౌట్గా వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత అభిషేక్ శర్మ బాధ్యతలు తన భుజాలపై వేసుకుని కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తూ మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు
అభిషేక్ ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కేవలం 10 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేధించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ ఆటగాళ్లు అభిషేక్ వద్దకు వచ్చి సరదాగా బ్యాట్ను పరిశీలించారు. అభిషేక్ కూడా నవ్వుతూ బ్యాట్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో నీ బ్యాట్లో స్ప్రింగ్ ఉందా? అంటూ అభిమానులు జోకులు పేలుస్తున్నారు.
ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 20 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 14 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేయడం ద్వారా టీ20ల్లో భారత ఆటగాళ్లలో సెకండ్ ఫాస్టెస్ట్ అర్ధశతకంగా నిలిచింది. యువరాజ్ సింగ్ 2007 టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్పై 12 బంతుల్లో అర్ధశతకం చేసిన రికార్డు ఇంకా అలానే కొనసాగుతోంది. ఆ రికార్డుకు అభిషేక్ చాలా దగ్గరగా వెళ్లాడు.
మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ “జట్టు అవసరానికి తగ్గట్టు ఆడటమే నా లక్ష్యం. ప్రతిసారి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం సులభం కాదు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా కీలకం. యువరాజ్ పాజీ 12 బంతుల్లో అర్ధశతకం రికార్డు అసాధారణం. కానీ ప్రస్తుతం జట్టు మొత్తం ధైర్యంగా ఆడుతోంది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు” అని చెప్పాడు. ఈ విజయం ద్వారా భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 3-0తో ఆధిక్యం సాధించింది.
Latest News