ఐసీసీ ఇచ్చిన షాక్ తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్‌లో కొత్త వివాదం
 

by Suryaa Desk | Mon, Jan 26, 2026, 11:16 PM

టీ20 వరల్డ్‌కప్‌ 2026 నుంచి ఐసీసీ బంగ్లాదేశ్‌ను తప్పించిన కొన్ని గంటల్లోనే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆటగాళ్ల ఆందోళనలకు కారణమైన అధికారినే మళ్లీ కీలక పదవిలోకి తీసుకురావడం ద్వారా, బీసీబీ తమ సొంత ఆటగాళ్లను మోసం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన బీసీబీ డైరెక్టర్ ఎం. నజ్ముల్ ఇస్లాంను ఫైనాన్స్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించినట్లు ఇటీవల బోర్డు ప్రకటించింది. అదే నిర్ణయం వల్లే ఆటగాళ్లు చేపట్టిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) బహిష్కరణ ముగిసిందని అప్పట్లో భావించారు. అయితే ఇప్పుడు అదే నజ్ముల్ ఇస్లాంను తిరిగి ఫైనాన్స్ విభాగం బాధ్యతల్లోకి తీసుకురావడం తీవ్ర దుమారం రేపుతోంది.


ఈ మొత్తం వ్యవహారం మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ వ్యాఖ్యలతో మొదలైంది. టీ20 వరల్డ్‌కప్ వేదిక అంశంపై బీసీసీఐతో చర్చలు జరపాలని తమీమ్ సూచించగా నజ్ముల్ ఇస్లాం అతన్ని బహిరంగంగా భారత ఏజెంట్‌గా వ్యాఖ్యానించడం కలకలం రేపింది. అంతటితో ఆగకుండా, వరల్డ్‌కప్ నుంచి తప్పుకుంటే ఆటగాళ్లకు పారితోషికం అవసరం లేదని, సరైన ప్రదర్శన ఇవ్వకపోతే వారి నుంచి డబ్బులు కూడా వసూలు చేయాలన్న వ్యాఖ్యలు చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.


ఈ వ్యాఖ్యలతో విసిగిపోయిన ఆటగాళ్లు చివరకు నిరసనకు దిగారు. క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ మిథున్, జట్టు కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో, మెహిదీ హసన్ మిరాజ్ నేతృత్వంలో ఆటగాళ్లు బీపీఎల్‌ను బహిష్కరించారు. దీంతో ప్రసార ఆదాయంపై ప్రభావం పడుతుందన్న భయంతో బీసీబీ నజ్ముల్ ఇస్లాంను ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించి, షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ చర్యతో ఆటగాళ్లు మళ్లీ మైదానంలోకి వచ్చారు.


అయితే ఈ లోపులోనే అంతర్జాతీయంగా మరో పెద్ద దెబ్బ పడింది. భారత్‌కు వెళ్లేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ నిర్ణయాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. ఓ ప్రత్యేక కమిటీ విచారణ చేసి భద్రత విషయంలో ఎలాంటి ముప్పు లేదని చెప్పిన తర్వాత కూడా బీసీబీ తన వైఖరిని మార్చలేదు. చివరకు ఐసీసీ బంగ్లాదేశ్‌ను టీ20 వరల్డ్‌కప్ నుంచి తప్పించి, స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసింది.


ఈ పరిస్థితుల్లోనే బీసీబీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం, నజ్ముల్ ఇస్లాం షోకాజ్ నోటీసుకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉంది అంటూ, అతన్ని మళ్లీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. దీంతో ఆటగాళ్ల నిరసనలు, వారి గౌరవం, బాధ్యత అన్నీ బీసీబీకి ద్వితీయ అంశాలే అన్న అభిప్రాయం బలపడుతోంది.


Latest News
Usman Tariq is our trump card; Babar is not a concern for us: Pakistan skipper Salman Agha Sat, Feb 14, 2026, 04:16 PM
Bangladesh: Bomb explosion, post-election clash leave three dead Sat, Feb 14, 2026, 04:14 PM
PM Modi flags off 50 electric buses for Bhavnagar under PM e-Bus Sewa scheme Sat, Feb 14, 2026, 04:03 PM
AI won't kill IT services, will create more work: JP Morgan Sat, Feb 14, 2026, 02:52 PM
Telangana civic poll results a mandate for Congress' welfare model: Rahul Gandhi Sat, Feb 14, 2026, 02:51 PM