|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 11:17 PM
భారతీయ రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త. టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు, డిజిటల్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే అన్రిజర్వ్డ్ (జనరల్) టికెట్ బుకింగ్లపై భారీ డిస్కౌంట్స్ ఇస్తోంది. రైల్వే శాఖకు చెందిన అధికారిక మొబైల్ యాప్ రైల్వన్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకునే వారికి ఈ ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటుగా ఆర్థికంగా కూడా లబ్ధి కలుగుతుంది. రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ కొత్త రాయితీ విధానంతో సామాన్య ప్రయాణికులకు ట్రైన్ టికెట్ ఛార్జీలు కొంత మేర తగ్గుతాయి. మరి అది ఎలా పొందాలి అనేది తెలుసుకుందాం.
గతంలో రైల్వన్ మొబైల్ యాప్లో ఆర్ వాలెట్ ద్వారా ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకుంటే 3 శాతం మనీబ్యాక్ ఇచ్చేవారు. అయితే, జనవరి 14, 2026 నుంచి తీసుకొచ్చిన కొత్త స్కీమ్ ద్వారా క్యాష్ బ్యాక్ పెంచారు. టికెట్ ధరపై నేరుగా 3 శాతం రాయితీ ఇవ్వడంతో పాటు దీనికి అదనంగా ఆర్-వాలెట్ క్యాష్బ్యాక్ 3 శాతం లభిస్తుంది. ప్రయాణికులు మొత్తంగా 6 శాతం మేర టికెట్ ధరలో డిస్కౌంట్ పొందుతారు. దీంతో ప్రయాణికులకు టికెట్లపై భారీగా ఆదా అవుతుందని చెప్పవచ్చు.
ఈ ప్రత్యేక డిస్కౌంట్ స్కీమ్ అనేది 6 నెలల వరకే అందుబాటులో ఉంటుంది. డిజిటల్ టికెటింగ్ వ్యవస్థను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లే లక్ష్యంతో రైల్వే శాఖ ఈ ప్రత్యేక లిమిటెడ్ టైమ్ ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం రైల్వన్ యాప్లో టికెట్లు బుకింగ్ చేసుకునే అన్రిజర్వ్డ్(జనరల్)టికెట్లకు మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇతర వెబ్సైట్లు లేదా యాప్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే డిస్కౌంట్ లభించదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. భారతీయ రైల్వేల సొంత డిజిటల్ వాలెటే ఆర్-వాలెట్. సురక్షితమైన ట్రాన్సాక్షన్ల కోసం బయోమెట్రిక్ ప్రామాణీకరణ, ఎంపిన్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. దీని ద్వారా టికెట్ పేమెంట్లు వేగంగా పూర్తవుతాయి.
యాప్ రిజిస్ట్రేషన్ ఇలా..
గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి రైల్ వన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా కన్ఫర్మేషన్ చేయాలి
లాగిన్ కోసం mPIN లేదా బయోమెట్రిక్ లాక్ సెట్ చేసుకోవాలి.
యాప్లో ఉన్న బుక్ టికెట్ ఆప్షన్ ద్వారా ప్రయాణ వివరాలు ఇచ్చి, ఆర్-వాలెట్ ద్వారా డబ్బు చెల్లించాలి. దీంతో 6 శాతం డిస్కౌంట్ పొందుతారు.
తక్కువ ధరకే టికెట్లను పొందవచ్చు.
Latest News