రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 08:28 PM

హైదరాబాద్ శివారులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్రైన్ కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి- ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను బోడుప్పల్‌కు చెందిన విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు, విశాల్, చేతనరెడ్డిగా రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈమేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఆత్మహత్యలకు కారణమై ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయశాంతి భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Latest News
ICC confirms Men's T20 WC warm-ups schedule, 16 matches to be played at four venues Mon, Feb 02, 2026, 02:25 PM
Fierce govt-Oppn showdown in LS over Rahul Gandhi’s mention of ex-Army chief’s unpublished memoir Mon, Feb 02, 2026, 02:24 PM
EAM Jaishankar to embark on three-day US visit today Mon, Feb 02, 2026, 02:15 PM
India-Russia business talks seen as key factor in cementing ties Mon, Feb 02, 2026, 02:12 PM
Pragmatic Budget with capex focus, zero fireworks: Report Mon, Feb 02, 2026, 02:04 PM