|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 11:56 AM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బ తీయాలన్న దురుద్దేశంతోనే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ వివాదాన్ని సృష్టించారని వైయస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆక్షేపించారు. సీబీఐ సిట్ ఛార్జ్షీట్తో చంద్రబాబు కుట్ర బట్టబయలైందని, ఈ కేసులో ఆయన అడ్డంగా దొరికిపోయారని పేర్ని నాని వెల్లడించారు. ప్రశ్నించే గొంతు నొక్కేందుకు భౌతిక దాడులు చేసున్నారని, అంబటి రాంబాబుపై దాడి ప్రభుత్వ కుట్ర అని స్పష్టం చేశారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నం అత్యంత హేయమని కృష్ణా జిల్లా పామర్రులో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని ధ్వజమెత్తారు.
Latest News