జమ్మూ కశ్మీర్ లో భూకంపం
 

by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:15 PM

జమ్మూ కశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఒక్కసారిగా తలుపులు, కిటికీలు ఊగడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.ఈ భూకంపం తీవ్రత మధ్యస్థంగానే ఉన్నప్పటికీ, దీని కేంద్రం మధ్య కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఉండటంతో ప్రభావం ఎక్కువగా కనిపించింది. రాజధాని శ్రీనగర్‌కు కేవలం 21 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంతో లోయవ్యాప్తంగా ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయి. తెల్లవారుజామున 5.35 గంటలకు భూమి కంపించినట్లు అధికారులు ధ్రువీకరించారు.


 

Latest News
S. Korea's EV exports to US plunge nearly 90 pc in 2025 Wed, Feb 04, 2026, 11:57 AM
US Congress presses for stricter AI workplace rules Wed, Feb 04, 2026, 11:23 AM
LS adjourned till noon amid constant sloganeering from Oppn MPs Wed, Feb 04, 2026, 11:18 AM
CM Mamata Banerjee reaches SC for Bengal SIR hearing Wed, Feb 04, 2026, 10:52 AM
Dense fog grips Delhi; low visibility procedures in place at IGI Airport Wed, Feb 04, 2026, 10:43 AM