|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:35 PM
త్వరలోనే రాష్ట్రంలో నంది నాటకోత్సవాలు నిర్వహించడంతో పాటు నంది అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికారులు, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ వద్ద బోధిసిరి బోటులో నిర్వహించిన ‘కృష్ణాతీరం కవితాహారం’ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కళాకారులకు ఉగాది పురస్కారాలు, కందుకూరి పురస్కారాలు కూడా అందజేస్తామని తెలిపారు. ఇక, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహాకవి తిక్కన విగ్రహం ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే చర్చించామని, త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
Latest News