అమ్మ, పిన్ని స్నానం చేస్తుండగా వీడియోలు తీసి ప్రియుడికి పంపిన యువతి
 

by Suryaa Desk | Mon, Feb 09, 2026, 08:15 PM

ఏ కూతురు చేయకూడని దారుణానికి ఓ కుమార్తె ఒడిగట్టింది. కన్నతల్లి ప్రైవేట్ ఫోటోలను ప్రియుడికి పంపి.. అత్యంత దుర్మర్గంగా వ్యవహరించింది. కడుపున పుట్టిన కూతురే ఇలాంటి నీచమైన పనికి పాల్పడటంతో ఆ తల్లి గుండె ముక్కలైంది. చివరకు చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూతురు అనే పదానికి కళంకం తెచ్చిన ఈ సంఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 25 ఏళ్లుగా బెంగళూరులో నివాసం ఉంటోన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె (23) బీబీఏ పూర్తిచేసి ఇంట్లో ఖాళీగా ఉంటుంది. చిన్న కుమార్తె ప్రస్తుతం చదువుతోంది. వంట మనిషిగా పనిచేస్తూ తండ్రి కూటుంబాన్ని పోషిస్తుండగా.. తల్లి గృహిణి.


ఈ క్రమంలో ఏడాది కిందట పెద్ద కుమార్తె తన చదువుకు అవసరమని తండ్రికి చెప్పి మొబైల్ ఫోన్ కొనిపించింది. కాగా, నెల రోజుల కిందట నుంచి ఆమె ప్రవర్తనలో మార్పును తల్లిదండ్రులు గమనించారు. ఫోన్‌లో ఎవరితోనూ మాట్లాడుతున్నట్టు గుర్తించారు. ఓ రోజు ఇంటి పనిలో ఉన్న తల్లి.. కుమార్తె గదిలోకి అనుకోకుండా వెళ్లింది. ఈ సమయంలో ఓ వ్యక్తితో తన కుమార్తె వీడియో కాల్‌లో మాట్లాడటం ఆమె కంటపడింది. తల్లిని చూడగా వీడియో కాల్‌ను ఆమె కట్ చేసి ఏమీ తెలియనట్టు నటించింది. తల్లి నిలదీయంతో పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకుంది.


ఆమె ప్రవర్తన పట్ల ఆందోళన చెందిన ఆ దంపతులు.. తమ దగ్గరి బంధువులను రప్పించి కుమార్తెకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ యువతి అవతలి వ్యక్తి గురించి వివరాలను బయటపెట్టలేదు. అంతేకాదు, ఫోన్ పాస్ వర్డ్‌ను సైతం చెప్పడానికి ససేమిరా అంది. చాలా ప్రయత్నాల అనంతరం ఆమెను ఒప్పించి చివరకు ఫోన్‍ను ఓపెన్ చేయగలిగారు. అన్‌లాక్ చేసిన తర్వాత అందులోని ఉన్న ఫోటోలు, వీడియోలు చూసి నిర్ఘాంతపోయారు. తన తల్లితో పిన్ని నగ్న ఫోటోలు, వీడియోలు బయటపడ్డాయి. తల్లి నిద్రపోతున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు రహస్యంగా వీడియోలు, ఫోటోలు తీసి వాటిని తన ప్రియుడికి పంపింది. ఆమె వరుణ్ అలియాస్ గిరిధర్ అనే యువకుడ్ని ప్రేమించిన విషయం కూడా తెలిసింది.


వారం రోజుల క్రితం వరుణ్‌ను పెళ్లి చేసుకోబోతున్నానని తన కుటుంబ సభ్యులకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అతడి నేపథ్యం గురించి తెలియక, తమ కుమార్తె భద్రత గురించి ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఫిబ్రవరి 5న పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు యువతి, ఆమె ప్రియుడి ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, నివేదిక వచ్చిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కూమార్తె ద్వారా యువకుడు సేకరించిన తమ వ్యక్తిగత ఫోటోలను ఇతరులకు పంపాడా? ఇదంతా చేయించింది అతడేనా? ఎవరైనా ఉన్నారా? అని ఆందోళన చెందుతున్నారు.

Latest News
Andhra bus fire tragedy: State govt announces Rs 5 lakh ex gratia Thu, Mar 26, 2026, 05:00 PM
India to boost critical mineral exploration, push startup-led mining ecosystem: Dr Jitendra Singh Thu, Mar 26, 2026, 04:48 PM
Bengaluru medical school professor assaulted after allegedly proposing to student in classroom Thu, Mar 26, 2026, 04:44 PM
'I heard RCB chants when Wankhede was silent': Bethell recalls T20 WC knock vs India Thu, Mar 26, 2026, 04:38 PM
Pakistan: Over 14,000 schools damaged by 2022 floods in Sindh still await restoration Thu, Mar 26, 2026, 04:37 PM