చంద్రుడిపై నుంచి మట్టి సేకరణకు ఇస్రో సిద్ధం
 

by Suryaa Desk | Tue, Feb 10, 2026, 10:38 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-4 మిషన్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. చంద్రుడిపైకి భారత్ పంపబోయే అత్యంత సంక్లిష్టమైన మిషన్ చంద్రయాన్-4 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు అప్పుడే రంగం సిద్ధం చేశారు. మిషన్ ప్రారంభానికి మరో రెండేళ్ల సమయం ఉండగానే, చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ దిగాల్సిన ఖచ్చితమైన స్థలాన్ని ఇస్రో గుర్తించింది. 2028 నాటికి ఈ మిషన్ ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై మాన్స్ మౌటన్ ప్రాంతంలోని ఎంఎం-4 అనే ప్రదేశాన్ని ల్యాండింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఖచ్చితంగా గుర్తించారు. ఈ అత్యంత సంక్లిష్టమైన మిషన్ ద్వారా చంద్రుడిపై నుంచి మట్టి, రాళ్ల నమూనాలను భూమికి తీసుకురావడమే లక్ష్యం. ఇందులో ప్రొపల్షన్, డిసెండర్, అసెండర్, ట్రాన్స్ఫర్, రీ-ఎంట్రీ అనే ఐదు మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మిషన్ విజయవంతమైతే, చంద్రుడి నుంచి నమూనాలను సేకరించిన అతికొద్ది దేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తుంది.

Latest News
Pakistan: Prices of medicines increase in Rawalpindi Sun, Mar 29, 2026, 03:14 PM
Passenger arrested for hoax bomb alert at Mumbai airport Sun, Mar 29, 2026, 03:01 PM
Man kills wife in front of minor daughter in Kolkata, arrested Sun, Mar 29, 2026, 01:54 PM
TN polls: TVK announces 234 candidates; Vijay to contest from two seats Sun, Mar 29, 2026, 01:40 PM
Batting with Virat makes your job a whole lot easier: Padikkal Sun, Mar 29, 2026, 01:28 PM