|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:08 PM
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ సందర్భంగా భారత క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు బస చేసేందుకు బీసీసీఐ అనుమతి నిరాకరించింది. ఈ విషయంలో తన కఠిన నిబంధనలకే కట్టుబడి ఉండాలని బోర్డు నిర్ణయించింది. ఆటగాళ్ల కుటుంబాలను అనుమతించే విషయంపై స్పష్టతనివ్వాలని టీమ్ మేనేజ్మెంట్ కోరినప్పటికీ, బీసీసీఐ అందుకు అంగీకరించలేదని నివేదికలు పేర్కొన్నాయి.నివేదికల ప్రకారం "ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉండటానికి వీల్లేదని బోర్డు స్పష్టం చేసింది. అయితే, వారు కోరుకుంటే సొంతంగా వేరే ఏర్పాట్లు చేసుకోవచ్చు" అని ఓ అధికారి తెలిపారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం, 45 రోజులకు మించిన పర్యటనల్లో 14 రోజులు, అంతకంటే తక్కువ నిడివి గల టూర్లలో 7 రోజులు మాత్రమే కుటుంబ సభ్యులను అనుమతిస్తారు.
Latest News