|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 06:17 PM
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది. విద్యాహక్కు చట్టం కింద వచ్చే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ స్కూళ్లల్లో 25 శాతం సీట్లలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. పేద విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అనాథ పిల్లలకు సీట్లు కేటాయించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంఈవో ఆఫీసులు, ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 1800425899 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చు.
Latest News