|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 10:24 PM
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ నమ్మకంతోనే జీవిస్తున్నానని కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పకుండా వస్తుందని అన్నారు.శ్రమ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతిఫలం ఉంటుంది. భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు అని ఆయన శుక్రవారం వ్యాఖ్యానించారు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఆ తర్వాత టిప్టూరులో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా స్పందించారు. ఢిల్లీ పర్యటన తర్వాత మీలో విశ్వాసం పెరిగిందా అని ప్రశ్నించగా, పై వ్యాఖ్యలనే పునరుద్ఘాటించారు. అధికార మార్పిడిపై చర్చించేందుకు ఫిబ్రవరి 17న మిమ్మల్ని, సీఎం సిద్ధరామయ్యను హైకమాండ్ ఢిల్లీకి పిలిచిందనే వార్తలపై స్పందిస్తూ ఆ విషయం నాకు తెలియదు. కాలమే సమాధానం చెబుతుంది అని అన్నారు. ఇదే అంశంపై హోంమంత్రి పరమేశ్వర అధిష్ఠానాన్ని వివరణ కోరతానన్న దానిపై ఆయనకు మంచి జరగాలి" అని బదులిచ్చారు.కొందరు ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు వెళ్తున్నారనే దానిపై నివేదిక కోరారా అని అడగ్గా, తాను ఎలాంటి నివేదిక కోరలేదని, ఆ సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని స్పష్టం చేశారు.నేను పార్టీకి క్రమశిక్షణ గల సైనికుడిని. పార్టీ ఏది చెబితే దానికి కట్టుబడి ఉంటాను. మిగతా ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకోను. ఎమ్మెల్యేలు ఏమైనా సమస్యలు లేవనెత్తితే వాటిని హైకమాండ్ నాయకులు, ముఖ్యమంత్రి చూసుకుంటార అని వివరించారు.ఇదిలా ఉండగా, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలనేది తమ ఆకాంక్ష అని, రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారని ఆయన మద్దతుదారు, ఎమ్మెల్సీ చెన్నరాజ్ హట్టిహోళి పేర్కొనడం గమనార్హం.
Latest News