|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 11:00 AM
ఏపీఎస్ఆర్టీసీ మహిళలకు మరో గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో భాగంగా, తాజాగా ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పీఎం-ఈబస్ సేవ పథకం కింద కేంద్రం రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులను కేటాయించింది. వీటిలో విజయవాడకు 100 బస్సులు రానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న ‘స్త్రీశక్తి’ పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే, కొత్తగా వచ్చే ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల మహిళా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, కాలుష్య రహిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ నిర్ణయంతో దూరప్రాంతాలకు వెళ్లే మహిళలతో పాటు, నగరాల్లో నిత్యం ప్రయాణించే వారికి కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా విజయవాడ వంటి రద్దీ నగరాల్లో 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.
Latest News