|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 07:10 PM
AP: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి జీతాలను 20% పెంచడానికి ఆమోదం తెలిపింది. అలాగే, ₹5 లక్షల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించనుంది. గ్రాట్యుటీని ₹2 లక్షల నుంచి ₹4 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాలతో PACS ఉద్యోగులు తమ సమ్మెను విరమించుకున్నారు. ఈ మార్పులపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Latest News