|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 02:26 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై చేపట్టిన సైనిక దాడులపై మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా ప్రజలు కోరుకోని యుద్ధంలోకి ట్రంప్ దేశాన్ని లాగుతున్నారని, ఆయన చర్యలు తొందరపాటుతో కూడుకున్నవని, ఏమాత్రం సమర్థనీయం కావని ఆమె ఆరోపించారు. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ మరణించిన నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి."ఇరాన్లో పాలన మార్పు కోసం చేస్తున్న ఈ యుద్ధాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ట్రంప్ తన ఇష్టానుసారం ఎంచుకున్న ఈ యుద్ధం కోసం మన సైనికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు" అని కమలా హ్యారిస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సైనిక చర్య అమెరికన్ల ప్రాణాలతో ఆడుకునే ప్రమాదకరమైన జూదమని, ఇది ఈ ప్రాంత స్థిరత్వానికి, ప్రపంచంలో అమెరికా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని ఆమె హెచ్చరించారు.
Latest News