|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 10:07 PM
అమెరికాలో నిర్వహించే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో ఆడనున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2026 సీజన్ కోసం సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టుతో అశ్విన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది అశ్విన్కు రెండో విదేశీ టీ20 లీగ్ కాగా, ఇప్పటికే బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్ కోసం సిడ్నీ థండర్ జట్టుతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ… “ఎంఎల్సీ గత కొన్ని సీజన్లలో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు పాల్గొనడంతో మంచి గుర్తింపు పొందింది. ఈ లీగ్లో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. తొలి భారత ఆటగాడిగా ఆడటం నా బాధ్యతగా భావిస్తున్నాను. యూనికార్న్స్ జట్టుకు విజయాలు అందించడం నా లక్ష్యం” అని తెలిపాడు.2023లో జరిగిన తొలి సీజన్ నుంచే యూనికార్న్స్ జట్టులో ఉన్న హారిస్ రౌఫ్తో కలిసి అశ్విన్ ఈ సీజన్లో ఆడనున్నాడు.యూనికార్న్స్ హెడ్ కోచ్ కెమెరాన్ వైట్ మాట్లాడుతూ… “అశ్విన్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో చేరడం మా అదృష్టం. అతని అనుభవం, మ్యాచ్ను మలుపుతిప్పే సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది” అని పేర్కొన్నారు.జూన్ 19న లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్తో యూనికార్న్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జూలై 18న ఓక్లాండ్ కొలీసియంలో జరిగే ఫైనల్తో సీజన్ ముగియనుంది. మార్చి 26న రాబోయే సీజన్ కోసం జట్టులోని కీలక ఆటగాళ్లను యూనికార్న్స్ యాజమాన్యం కొనసాగించినట్లు ప్రకటించింది.అశ్విన్ భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ మరియు 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్లలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 287 మ్యాచ్ల్లో 765 వికెట్లు తీసి అద్భుత రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో కూడా అశ్విన్ చెన్నై, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ మంచి ప్రదర్శన కనబర్చాడు. ఇటీవల బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్లో సిడ్నీ థండర్ తరఫున ఆడాల్సి ఉన్నప్పటికీ గాయం కారణంగా దూరమయ్యాడు.
Latest News